Corona cases | దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,89,176కు చేరాయి. ఇందులో 4,37,70,913 మంది బాధితులు కోలుకోగా, 5,27,556 మంది మృతిచెందారు.
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,89,176కు చేరాయి. ఇందులో 4,37,70,913 మంది బాధితులు కోలుకోగా, 5,27,556 మంది మృతిచెందారు. మరో 90,707 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 68 మంది మరణించగా, 13,528 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.61 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 211.13 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.