న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి చేరింది. అదేవిధంగా కొత్తగా మరో ముగ్గురు మరణించారు. వారంతా కేరళ, కర్ణాటక, బీహార్కు చెందినవారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
2020లో వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,13,272) దాటింది. ఇందులో 5,33,361 మంది మరణించారు. మరో 4,44,75,602 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నది. నేటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 178 జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. 47 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా గోవాలో 47, కేరళలో 41, గుజరాత్లో 36, కర్ణాటకలో 34 చొప్పున ఉన్నాయి.