న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1994 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది వైరస్ బారినపడి మరణించారు. మరో 23,432 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో 0.05 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.55 శాతం కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.