న్యూఢిల్లీ: నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు 55వ ర్యాంక్, ఇంగ్లండ్కు 65వ ర్యాంక్ లభించింది. టర్కీ, జర్మనీ, జపాన్ తక్కువ నేరాలతో 92, 100, 135 స్థానాల్లో నిలిచాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ మంగళవారం వెలువరించిన మరో నివేదిక ప్రకారం అత్యధిక నేరాలు జరిగిన దేశంగా అఫ్గనిస్థాన్ అపకీర్తి మూటగట్టుకొన్నది.