న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ లక్షకు తగ్గకుండా, గత మూడు రోజులుగా అయితే రోజుకు 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,35,27,717కు చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న దేశాల జాబితాలో భారత్ బ్రెజిల్ను దాటేసి అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధికంగా 3,19,18,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 1,34,82,543 కరోనా కేసులతో బ్రెజిల్లో రెండో స్థానంలో ఉండేది. అయితే గత 24 గంటల్లో భారత్లో 1.68 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య బ్రెజిల్ కేసులను దాటేసి 1,35,27,717కు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య