న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ, ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతాలు శనివారం హ్యాక్ అయ్యాయి. వాతావరణ శాఖ ట్విట్టర్లో హ్యాకర్లు ఒక ప్రొమోషన్కు సంబంధించిన అంశాన్ని ట్వీట్ చేశారు. ‘బీన్జ్ అధికారిక కలెక్షన్ వేడుకలో భాగంగా రాబోయే 2 గంటల పాటు కమ్యూనిటీలోని యాక్టివ్ ఎన్ఎఫ్టీ వ్యాపారులందరికీ ఎయిర్డ్రాప్ను ప్రారంభించాం’ అని అందులో పేర్కొన్నారు. వాతావరణ శాఖ ప్రొఫైల్ చిత్రాన్ని కూడా హ్యాకర్లు తొలగించారు. అలాగే ఇతర ప్రైవేట్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు కూడా చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ హ్యాక్ను కొందరు గుర్తించారు. కాగా, తమ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
In celebration for the reveal of the Beanz Official Collection, we have opened up an airdrop to all active NFT traders in the community for the next 2 hours!
Claim Your Beanz
🔗 https://t.co/t40jmy6f0lTake the red bean fren 🉐 pic.twitter.com/UDOBxWXfy4
— . (@Indiametdept) April 9, 2022
మరోవైపు శనివారం హ్యాక్ సంఘటనలు జరుగడం ఇది రెండోది. దీనికి ముందు శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. దీంతో అధికారులు స్పందించారు. నాలుగు గంటల తర్వాత దానిని పునరుద్ధరించారు. యూపీ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించారు.