న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 2841 కేసులు నమోదవగా, తాజాగా 2,487 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,21,599కు చేరాయి. ఇందులో 4,25,76,815 మంది కోలుకున్నారు. మరో 5,24,214 మంది మరణించగా, 17,692 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13 మంది కరోనాతో మృతిచెందగా, 2878 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతానికి పడిపోయిందని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 673 ఉండగా, కేరళలో 523, హర్యానాలో 343, మహారాష్ట్రలో 248, ఉత్తరప్రదేశ్లో 158, కర్ణాటకలో 103 చొప్పున ఉన్నాయి.