India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి పడగవిప్పుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,249 కొత్త కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,00,667 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,927 కేసులు యాక్టివ్ (Active Cases)గా ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందడంతో.. మరణాల సంఖ్య 5,30,818గా నమోదైంది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,61,922 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Pradeep Sarkar | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Ajay Banga | భారత్ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి నామినీ అజయ్ బంగాకు కరోనా పాజిటివ్