న్యూఢిల్లీ: దేశంలో జూన్ నాటికి ప్రతి రోజు 2,320 కరోనా మరణాలు నమోదవుతాయని లాన్సెట్ కరోనా కమిషన్ తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కారణాలను గుర్తించి నియంత్రణకు అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించింది. భారత టాస్క్ఫోర్స్ సభ్యులున్న ఈ కమిటీ దేశంలో కరోనా రెండో దశపై అధ్యయనం చేసింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 40 రోజుల్లో దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 నుంచి 80,000కు పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ సంఖ్య చేరేందుకు 83 రోజుల సమయం పట్టిందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తిస్తున్నదని టాస్క్ఫోర్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,17,353 కరోనా కేసులు, 1,185 మరణాలు నమోదయ్యాయి.