Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon). జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలానికి దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) 87 సెంటీమీటర్లతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్లో 106 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.
ఐఎండీ చీఫ్ మృత్యంజయ్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 1951 నుంచి 2023 వరకు ఉన్న డేటా ప్రకారం లానినా, ఎల్నివో సంఘటనలను అనుసరించి భారత్లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఇక గత నాలుగు సంవత్సరాల రుతుపవనాల సీజన్లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఈ సారి వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. జులై నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.
Also Read..
Bhagwant Mann | కేజ్రీవాల్ను జైల్లో కరుడుగట్టిన నేరస్థుడిలా ట్రీట్ చేస్తున్నారు : పంజాబ్ సీఎం
PM Modi | గత పదేళ్ల ఎన్డీయే పాలన ట్రైలర్ మాత్రమే.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది : ప్రధాని మోదీ
Lok Sabha polls | లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే.. తొలి విడతలో రికార్డు స్థాయిలో పట్టుబడిన నగదు