El Nino | న్యూఢిల్లీ, మార్చి 1: ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మార్చి-మే మధ్యలో దేశవ్యాప్తంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మించి నమోదవుతాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారతంతో కూడిన ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. మార్చి నెల దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మీడియా ముఖంగా చెప్పారు. మధ్య పసిఫిక్ మహా సముద్రంపై ఎల్నినో పోయి..లానినా పరిస్థితులు ఏర్పడటం ద్వారా భారత్లో మంచి వర్షపాతం నమోదవుతుందన్నారు. రాబోయే వర్షకాలం రెండో అర్ధభాగంలో లానినా ఏర్పడే అవకాశముందన్నారు.