న్యూఢిల్లీ: సైబర్ నేరాల(Cybercrime)పై తాజా రిపోర్టు రిలీజైంది. దాంట్లో ఇండియా 80వ స్థానంలో ఉన్నది. 2023 సంవత్సరంలో దేశంలోని సుమారు 34 శాతం మంది యూజర్లను స్థానికంగా టార్గెట్ చేసినట్లు ఆ రిపోర్టు ద్వారా తేలింది. యూజర్ల కంప్యూటర్లలోకి నేరుగా వస్తున్న స్పామ్ మెసేజ్లు లేదా ఫ్లాష్ డ్రైవ్స్, కెమెరా మెమోరీ కార్డులు, ఫోన్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ల్లో ఆ మెసేజ్లను గుర్తించిన ఆధారంగా డేటాను రూపొందించారు. దేశంలో సుమారు 74,385,324 స్థానిక సైబర్ దాడుల్ని కాస్పర్స్కీ నిలువరించినట్లు తెలుస్తోంది.
కాస్పర్స్కీకి చెందిన వేర్వేరు యాంటీ వైరస్ ఉత్పత్తులు .. సైబర్ దాడుల్ని గుర్తించి, ఆపేసినట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియాలో గత ఏడాది సుమారు 6 బిలియన్ల డాలర్ల సైబర్సెక్యూర్టీ మార్కెట్ జరిగింది. గ్లోబల్ సైబర్ సెక్యూర్టీ, డిజిటల్ ప్రైవసీ కంపెనీ కాస్పర్స్కీ .. సైబర్ దాడులకు చెందిన మరికొన్ని విషయాలను వెల్లడించింది. భారతీయ యూజర్లలో 34 శాతం మందికి స్థానిక సైబర్ దాడులు జరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ దాడులు కూడా పెరిగినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇదే సమయంలో ఆయ కంపెనీలు సైబర్ సెక్యూర్టీని ప్రాధానత్య ఇస్తున్నట్లు తెలిపింది. ఇండియాలోని దాదాపు 67 శాతం కంపెనీలు సెక్యూర్టీని ఔట్సోర్సింగ్ చేస్తున్నట్లు ఆ కంపెనీ రిపోర్టలో తేలింది. డిజిటల్ కనెక్టివిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల.. ఇండియాలో సైబర్ బెదిరింపులు కూడా ఎక్కువైనట్లు చెప్పింది.