CM KCR | భారత్ పేద దేశం ఎంతమాత్రమూ కాదు.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
భారత్లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ, ప్రజలు వంచనకు గురవుతున్నారు. భారత్లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకొకటి లేదు. భారత్ బుద్ధి జీవుల దేశం. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు, రైతులు గెలవాలి. ఆ సమయం ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మహారాష్ట్రలో ఇన్ని నదులున్నా.. నీటి కరువు ఎందుకు వచ్చింది. 54 ఏండ్లు కాంగ్రెస్.. 16 ఏండ్లు బీజేపీ పాలించాయి. ఇవి ఏం సాధించాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తప్పా చేసిందేమీ లేదు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.