న్యూఢిల్లీ: మన దేశంలో మతం ప్రాముఖ్యమైనదే అని, అయితే అది చట్ట పరిధిలో మాత్రమేనని, అన్ని వేళలా భారత్ లౌకిక దేశమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘పౌరులు, ప్రభుత్వం చేసే ప్రతి పనిలో లౌకిక స్ఫూర్తిని చాటాలి’ అని జస్టిస్ జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మైనారిటీ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. మైనారిటీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని ఉపసంహరించడాన్ని ఎత్తిచూపుతూ, విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)సీని అమలు చేయాలని పిటిషనర్ కోరారు.