న్యూఢిల్లీ, జనవరి 8: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ దేశ డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సోమవారం దీనిపై వివరణ కోరుతూ భారత్లో మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీద్కు సమన్లు జారీచేసింది. ‘మాల్దీవుల దౌత్య అధికారి డాక్టర్ అలీ నజీర్ మహ్మద్-భారత హై కమిషనర్ మును మహవార్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని ఈ సందర్భంగా అలీ నజీర్ స్పష్టం చేశారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, మాల్దీవులను బాయ్కాట్ చేయాలని ఇదివరకే టూరిస్టులు పిలుపునివ్వగా, తాజాగా ట్రేడర్లు కూడా జతకలిశారు.