న్యూఢిల్లీ, జూన్ 29: ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
సుమారుగా రూ.968 కోట్ల (118 మిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడుల్ని, 21,268 ఉద్యోగాల్ని భారతదేశం కోల్పోయిందని నివేదిక పేర్కొంది. ‘నెట్లాస్ కాలిక్యులేటర్’ సంస్థ నివేదిక ప్రకారం, భారత్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటం ఈ ఏడాది 16శాతం పెరిగిందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమని పేర్కొంది.