India | ముంబై: దేశం అప్పుల కుప్పగా మారుతోంది. భారత్పై అప్పు భారం ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి భారత్ నెత్తిపై రూ.205 లక్షల కోట్ల రుణ భారం నమోదైంది. దేశం మొత్తం రుణాలు లేదా మార్కెట్లో ట్రేడవుతున్న మొత్తం బాకీలు 2.47 ట్రిలియన్ యూఎస్ డాలర్లు (రూ.205 లక్షల కోట్లు)కు పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. సెప్టెంబర్ త్రెమాసికంలో దేశం అప్పులు 1.34 ట్రిలియన్ డాలర్లు (రూ.161.1 లక్షల కోట్లు)గా నమోదైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన డాటాను ఉటంకిస్తూ ఇండియన్ బాండ్స్.కామ్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా వివరించారు.
రూ.161.1 లక్షల కోట్ల రుణం వద్ద మొత్తం రుణంలో కేంద్ర ప్రభుత్వ అప్పు వాటా అత్యధికంగా 46.04 శాతం నమోదైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 24.4 శాతం అనగా 604 బిలియన్ యూఎస్ డాలర్లు (రూ.50.18 లక్షల కోట్లు), ట్రెజరీ బిల్లుల వాటా 4.51 శాతం(111 బిలియన్ యూఎస్ డాలర్లు అంటే రూ.50.18 లక్షల కోట్లు), కార్పొరేట్ బాండ్ల వాటా 21.52 శాతం ఉన్నాయి.