న్యూఢిల్లీ: వార్షిక పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144వ స్థానంలో నిలిచింది. భారతదేశ మొబిలిటీ స్కోర్ 2019లో 71 ఉండగా.. 2020లో కరోనా ఆంక్షల నేపథ్యంలో 47కు తగ్గింది.
ఆంక్షలు తొలగించిన తర్వాత 2022లో మళ్లీ 73 స్కోర్ సాధించగా, ఈ సంవత్సరం 70కు తగ్గింది. విదేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం, వీసా ఆన్ అరైవల్, ఈ-వీసా వంటి సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకొని ఆర్టన్ క్యాపిటల్ సంస్థ మొబలిటీ స్కోర్ ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది.