శ్రీనగర్: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జమ్ముకశ్మీర్ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో భాగమై ఉన్నదని, కానీ ఆ రాజ్యాంగాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని ముఫ్తీ మండిపడ్డారు.
ఇవాళ శ్రీనగర్లో మీడియాతో మాట్లాడిన మెహబూబా ముఫ్తీ.. భారతదేశం బీజేపీ సొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించనంత వరకు మీరు ఎలాంటి మంచి ఫలితాన్ని చూడలేరని ఆమె బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేంద్ర బలగాలను కశ్మీర్కు పంపించినా సమస్య పరిష్కారం కాదని ముఫ్తీ జోష్యం చెప్పారు.