న్యూఢిల్లీ: దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తెలిపారు. లోక్సభలో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ముస్లింలతో పోలిస్తే, భారత్లో ముస్లింలు బెటర్గా ఉన్నట్లు చెప్పారు. అందుకే పొరుగు దేశాల్లో ఉంటున్న ముస్లింలు కూడా ఆశ్రయం కోరుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇతర దేశాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ఓటింగ్ హక్కుల గురించి కూడా మంత్రి రిజిజు తెలిపారు. దేశం గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఇమేజ్పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు మైనార్టీలకు న్యాయరక్షణ కల్పిస్తోందని మంత్రి రిజిజు తెలిపారు.
ప్రజాస్వామ్య రంగంలో భారత్తో ఏ దేశాన్ని కూడా పోల్చలేమన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో చాలా గ్యాప్లు ఉన్నాయని, అందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్ నినాదాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా.. భారత్ను అభివృద్ధి దేశంగా ఎందుకు మార్చలేకపోయారని అడిగారు.