న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంట పరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు భారత్ – చైనా సైనికుల మధ్య 14వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఈ నెల రెండో వారంలో ఇరుదేశాల మధ్య భేటీ జరుగనున్నది. సెప్టెంబర్ 16న తజికిస్థాన్ రాజధాని దుషాన్బేలో భారత విదేశాంగ శాఖ జైశంకర్.. మంత్రి చైనా మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి, తూర్పు లద్దాఖ్లోని ఎల్ఏసీ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఇరు పక్షాలు కృషి చేయాలని సూచించారు. పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ అనంతరం.. గతేడాది మే 5న భారతదేశం-చైనా మిలిటరీల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఇరుపక్షాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో గతేడాది జూన్ 15న గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా, ఫిబ్రవరిలో పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున, ఆగస్ట్లో గోగ్రా ప్రాంతంలో ఇరుపక్షాలు బలగాలను వెనక్కి తీసుకున్నాయి. మిగతా పాంత్రాల్లో బలగాల ఉపసంహరణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. చివరి సారిగా గత అక్టోబర్ 10న ఇరుదేశాల మధ్య 13వ రౌండ్ చర్చలు జరిగాయి.