న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఇండియా కూటమి (INDIA Bloc) మెగా ర్యాలీ నిర్వహించనుంది. రామ్లీలా మైదాన్లో (Ramlila Maidan) జరుగనున్న ర్యాలీకి కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, ఆప్ సహా సుమారు 28 పార్టీల సీనియర్ నేతలు హాజరుకానున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మెగా ర్యాలీ ద్వారా సత్తా చాటాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఈ మెగా ర్యాలీలో ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల జప్తు వంటి అనేక అంశాలను ప్రస్తావించనున్నారు.
ఈ ర్యాలీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, భగవంత్ మాన్, చంపాయ్ సోరెన్, మమతా బెనర్జీ ప్రతినిధులు పాల్గొంటారని ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. డీఎంకే ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, వామపక్షాల ప్రముఖ నేతలు కూడా హాజరుకానున్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా రాంలీలా మైదాన్లో జరగనున్న ఇండియా అలయన్స్ ర్యాలీలో పాల్గొనున్నారు.
Delhi CM and AAP Convener Arvind Kejriwal’s wife Sunita Kejriwal to attend INDIA alliance rally at Ramlila Maidan https://t.co/GudwYkHC5Z
— ANI (@ANI) March 31, 2024
కాగా, ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ విడుదల చేశారు. రంజిత్ సింగ్ ఫ్లైవోర్, బారఖంబ రోడ్, గురునానక్ చౌక్, వివేకానంద్ మార్గం, మింటో రోడ్డు, కమలా మార్కెట్, హందర్ద్ చౌక్, జేఎల్ఎన్ మార్గ్, ఢిల్లీ గేట్, అజ్మేరీ గేట్, చమన్లాల్ మార్గ్, తుర్క్మన్ గేట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు.
Traffic Advisory
In view of a political rally at Ramlila Maidan on March 31, 2024, traffic will be affected.
Kindly follow the traffic advisory. #DPTrafficAdvisory pic.twitter.com/UBozpP2wVA
— Delhi Traffic Police (@dtptraffic) March 30, 2024