DCGI | న్యూఢిల్లీ: నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయం వినియోగదారులకు తెలిసేలా మందుల లేబుళ్లపై సమాచారాన్ని ముద్రించాలని ఔషధ కంపెనీలకు తెలిపింది. ఎఫ్డీసీ హేతుబద్ధ ఔషధమైనా చిన్న పిల్లల్లో దాని వినియోగం ఆమోదయోగ్యం కాదన్న నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.