న్యూఢిల్లీ, నవంబర్ 9: భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు. గూఢచర్యం ఆరోపణలతో వీరికి మరణశిక్ష విధించినట్టు సమాచారమున్నదని తెలిపారు.
ఈ కేసు నుంచి బయటపడేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.