న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. రెండు దేశాల మధ్య చాలా ముఖ్యమైన బంధం ఉందన్నారు. అమెరికాకు చెందిన న్యూస్వీక్ మ్యాగ్జిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత్ దృష్టిలో చైనాతో సంబంధం చాలా ముఖ్యమైందని, బోర్డర్ వద్ద చాన్నాళ్లుగా ఉన్న పరిస్థితిని పరిష్కరించుకోవాలని, దాని వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడరాదు అని ఆయన అన్నారు. పాజిటివ్గా ముందుకు వెళ్లడం వల్ల .. బోర్డర్ వద్ద శాంతిని తిరిగి స్థాపించవచ్చు అని మోదీ తెలిపారు. ఇండియా, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికి, ప్రపంచానికి ముఖ్యమైనవని ఆయన అన్నారు. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చల్లో నిర్మాణాత్మకంగా, పాజిటివ్గా ఉంటే బోర్డర్ వద్ద శాంతి నెలకొంటుందన్నారు. లడాక్లోని గల్వాన్ వ్యాలీలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డ విషయం తెలిసిందే.