న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. బ్రిటన్, ఓమన్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్లో కార్యరూపం దాలుస్తాయని, న్యూజిలాండ్తో కుదుర్చుకున్న ఒప్పందం సెప్టెంబర్లో అమలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి చెందిన చట్ట నిబంధనలను ఖరారు చేసేందుకు భారత్, అమెరికా అధికారుల మధ్య మూడు రోజుల పాటు జరిగే సమావేశాలు ఈ నెల 23న అమెరికాలో ప్రారంభమవుతాయని గోయల్ చెప్పారు.