న్యూఢిల్లీ : (Vaccination) కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అందుకున్నది. భారతదేశంలో ఇప్పటివరకు 95 కోట్లకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్లను అందించారు. ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ట్విట్టర్లో పంచుకున్నారు. త్వరలోనే కొత్త మైలురాయి 100 కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మన దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ఆదివారం వరకు 95 కోట్లకు పైగా మందికి అందించారు. ‘ప్రపంచంలో అతిపెద్ద విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. భారతదేశం 95 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్ల అందివ్వడం పూర్తి చేసింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోస్లను అందించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. త్వరగా టీకాలు తీసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఆ విధంగా ప్రోత్సహించండి’ అని మాండవీయ ట్విట్టర్లో పేర్కొన్నారు.
టీకాలు వేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 8,28,73,425 డోసులు బ్యాలెన్స్, ఉపయోగించని టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి, విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్సిగ్నల్
మళ్లీ ప్రమాదకరంగా మారిన ఢిల్లీ గాలి నాణ్యత
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
జమ్ముకశ్మీర్లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..