న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 69,897 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,14,589 మంది మృతిచెందారు. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు 13,450 మంది కరోనా నుంచి బయటపడగా, 201 మంది మరణించారు.
కాగా, కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్కేసులు 0.16 శాతం మాత్రమేనని తెలిపింది. అదేవిధంగా ఇప్పటివకు 1,78,29,13,060 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నది.