న్యూఢిల్లీ, నవంబర్ 10: గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.
భారత్ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా (10%), చైనా (7.1%) ఫిలిప్పీన్స్ (7.0%), పాకిస్థాన్ (5.7%) ఉన్నాయని పేర్కొంది.