Independence Day | న్యూఢిల్లీ : పంద్రాగస్టు వేడుకలకు ఎర్రకోట ముందున్న జ్ఞాన్ పథ్ ముస్తాబవుతోంది. రకరకాల పూలతో ఆ ప్రాంతాన్ని అలంకరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 10 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు.
పంద్రాగస్టు వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద 1000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు. ఎర్రకోట పరిసరాల్లో ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెంట్రల్ విస్టా నిర్మాణంలో భాగమైన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 20 వేలకు పైగా అధికారులు, పౌరులు పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. రాజ్ఘాట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్తో పాటు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.