భోపాల్, మే 4: మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ జాతీయ పార్కులో ప్రాచీనకాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 1,800-2,000 ఏండ్ల కిందట నిర్మించిన చిన్నపాటి చెరువులు, 1,500 ఏండ్ల కిందట రాళ్లపై మనిషి గీసిన బొమ్మలు ఇలా పలు ప్రాచీన ఆనవాళ్లను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
అప్పట్లో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఈ చెరువులు తవ్వినట్టు అధికారులు చెప్పారు. అలాగే అప్పట్లో ఈ దారిగుండా వెళ్లే ప్రజలు రాళ్లపై బొమ్మలు గీసేవారని తెలిపారు. ఈ ఆనవాళ్లు ఆధునిక సమాజానికి తీసిపోని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.