కోల్కతా, మార్చి 6: బీజేపీ, కాంగ్రెస్కు సమదూరం పాటిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొన్నది. బీజేపీ విధానాలపై పోరాడే, ఇదే సమయంలో కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రతిపక్షాలు కలిసి ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ విషయంలో ఇప్పటికే తాము బీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, వచ్చే పార్లమెంట్ సెషన్లో ఈ వ్యూహం ప్రతిబింబిస్తుందని లోక్సభలో టీఎంసీ పక్షనేత సుదీప్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు.