న్యూఢిల్లీ: ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఇవాళ మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు బెయిల్ మంజూరీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(Land-For-Jobs Case) కేసులో బెయిల్ ఇచ్చారు. ముగ్గురికీ చెరి లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరీ చేశారు. ఈ కేసులో అక్టోబర్ 25వ తేదీన తదుపరి విచారణ ఉండనున్నది. అక్టోబర్ 7వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆర్జేడీ నేతలు ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చారు.
2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ .. రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు కోరిన బాధితుల నుంచి భూమి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ నియామకాల సమయంలో రైల్వేశాఖ రూల్స్ను ఉల్లించిందని, ప్రమాణాలకు తగినట్లు నియామకాలు జరగలేదని సీబీఐ తన రిపోర్టులో తెలిపింది.
ఇదే కేసులో ఢిల్లీ కోర్టు 2023 మార్చిలో లాలూ యాదవ్తో పాటు ఆయన భార్య రబ్రీ దేవీ, కూతురు మీసా భారతిలకు బెయిల్ మంజూరీ చేసింది