న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఈ ఏడాది అక్టోబర్లో గగన్యాన్ (Gaganyaan) మిషన్ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో గగన్యాన్ తొలి ట్రయల్ రన్ను ఇస్రో చేపట్టనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు.
ఆ తర్వాత రెండో ప్రయోగంలో మహిళా రోబో (Female Robot) వ్యోమిత్ర (Vyommitra) ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు మంత్రి వెల్లడించారు. మనిషి లాగే అన్ని యాక్టివిటీస్ను నిర్వహించగలిగే ఈ రోబోను పంపిన తర్వాత.. అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చని ఆయన తెలిపారు. భూమి పైనుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని చెప్పారు.