న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్దే తుది నిర్ణయమని, పంజాబ్లో పార్టీ ఇన్చార్జిగా పార్టీ ఎప్పటివరకు కొనసాగమంటే అప్పటివరకు కొనసాగుతానని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ చెప్పారు. పంజాబ్లో ముఖ్యమంత్రి అమరీందర్సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ మధ్య వివాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కొనసాగుతారా..? లేక తప్పుకుంటారా..? అని మీడియా ప్రశ్నించడంతో రావత్ పై విధంగా స్పందించారు.
అంతేగాక, మరో ఒకటి రెండు రోజుల్లో తాను పంజాబ్కు వెళ్తున్నానని, అక్కడ అమరీందర్సింగ్ను, సిద్ధూను కలిసి మాట్లాడుతానని హరీష్ రావత్ చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అమరీందర్, సిద్ధూ వివాదంపై మాట్లాడేందుకు హరీష్ రావత్ ఈ ఉదయం ఢిల్లీలోని రాహుల్గాంధీ నివాసానికి వచ్చారు. రాహుల్తో మాట్లాడి బయటికి రాగానే మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. రాహుల్తో భేటీ గురించి ప్రశ్నించగా.. పంజాబ్ పరిస్థితిపైనే చర్చించామని అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పారు.