LokSabha Elections 2024 : ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. విపక్ష ఇండియా కూటమి దళితులు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లో కోత విధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని యోగి ఆదిత్యానాథ్ గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరు రంగనాధ్ మిశ్రా కమిటీ, సచార్ కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. 27 శాతం రిజర్వేషన్లో 6 శాతం ముస్లింలకు ఇవ్వాలని రంగనాధ్ మిశ్రా కమిటీ సిఫార్సు చేయగా ఈ ప్రతిపాదనను అప్పట్లో బీజేపీ వ్యతిరేకించిందని పేర్కొన్నారు.
ఆపై సచార్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా వీరు రిజర్వేషన్లో కోత విధించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనికోసం యూపీఏ ప్రభుత్వం కొన్ని ముస్లిం కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఈ ప్రతిపాదననూ తాము అడ్డుకున్నామని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్ వ్యతిరేకించారని చెప్పారు.
ఇక ముస్లింలకు రిజర్వేషన్ ఉండాలని ముస్లిం కోటాకు మద్దతు ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడంతో ఈ అంశంపై మరోమారు హాట్ డిబేట్కు తెరలేచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వం మూడో సారి కేంద్రంలో కొలువుతీరితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్ష ఇండియా కూటమి నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
Read More :
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు.. కొనసాగుతున్న మూడో విడుత పోలింగ్