లక్నో, మార్చి 1: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో గురువారం 12వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. రాజ్హౌలిలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ కుమారుడు ‘ఆల్ ప్రిన్సిపాల్స్ ఆగ్రా’ అనే వాట్సాప్ గ్రూపులో గణితం, జీవశాస్త్రం ప్రశ్నా పత్రాలను షేర్ చేశాడు.
పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత పేపర్లు లీక్ అయ్యాయని అధికారులు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపల్, అతడి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవలే యూపీ ప్రభుత్వం లీకేజీ ఆరోపణలతో పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షను రద్దు చేసింది.