న్యూఢిల్లీ : టవల్ చుట్టుకుని ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో రైలులో కలియతిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోహిత్ గుహర్ ఈ వీడియోను షేర్ చేయగా 30 లక్షల మంది వీక్షించారు. వైరల్ వీడియోలో టీషర్ట్, టవల్తో ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో కంపార్ట్మెంట్లలో తిరుగుతూ ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్టు బిహేవ్ చేయడం కనిపిస్తుంది.
పలువురు ప్రయాణీకులు అతడి వైపు అదోలా చూస్తూ నవ్వుకోవడం కనిపించింది. వాటర్ ట్యాంక్ ఖాళీ అయింది..ఈరోజు ఆఫీస్లో స్నానం చేస్తా అని వీడియోకు క్యాప్షన్గా ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. టవల్తో రోడ్డు మీదకు రావడమేంటని పలువురు ఆక్షేపించగా, అతడి బోల్డ్ స్టెప్ను మరికొందరు యూజర్లు ప్రశంసించారు.