న్యూఢిల్లీ : బెంగళూర్ కేంద్రంగా పనిచేసే జర్మన్ కాన్సుల్ అచిం బుకర్ట్ కాన్సులేట్ నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే కాన్సులేట్లో జర్మన్ అధికారులు భారత కొలీగ్స్ నుంచి క్రికెట్ ఎలా ఆడాలో మెళకువలు నేర్చుకుంటున్నారు. లంచ్ బ్రేక్లో అధికారులు కార్యాలయంలో క్రికెట్ ఆడుతుండటం ఈ వీడియోలో కనిపించింది.
During lunch break my Indian colleagues try to teach my German colleagues how to play #cricket Happy to report that the consulate is still intact 😅🙈 pic.twitter.com/6HmqWBjrAm
— Achim Burkart (@GermanCG_BLR) November 22, 2022
జర్మన్ అధికారికి ఇద్దరు భారత ఉద్యోగులు బౌలింగ్ వేస్తుండటం కనిపించింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 31,000 వ్యూస్ వచ్చాయి. లంచ్ బ్రేక్లో మా ఇండియన్ కొలీగ్స్ జర్మన్ సహచరులకు క్రికెట్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయిస్తున్నారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది.
దేశాలను కలిపే గొప్ప క్రీడ ఇదేనని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇక భారత్-జర్మనీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తే టూరిజంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని వ్యాఖ్యానించారు. ఇక ఎక్కువమంది విరాట్ కోహ్లీలు రానున్నారని మరో యూజర్ కామెంట్ చేశారు.