ముంబై : అన్ని అవయవాలు బాగానే ఉన్నా పనిచేసేందుకు పలువురు బద్ధకిస్తుంటే దివ్యాంగ దంపతులు వర్క్ కల్చర్ను ప్రేరేపిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. మహారాష్ట్ర నాసిక్లోని ఓ స్టాల్లో మూగ, చెవిటి దంపతులు పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్ట్రీట్ పుడ్ రెసిపీ అనే పేజ్ ఇన్స్ట్రాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోకు 30 లక్షలు పైగా వ్యూస్ లభించాయి.
ఈ వైరల్ వీడియోలో మూగ, చెవిటి జంట పానీపూరి విక్రయిస్తూ కనిపించారు. వీరు కస్టమర్లకు సైగలతో సమాచారం అందిస్తూ రుచికరమైన పానీపూరిలను అందిస్తున్నారు. నాసిక్లోని అదగావ్ నాకా ప్రాంతంలో జత్రా హోటల్ సమీపంలో వీరి స్టాల్కు కస్టమర్లు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
వీరు ఇంటి నుంచే ఎంతో రుచికరమైన, శుభ్రమైన ఆహారం తీసుకువచ్చి కస్టమర్లకు సర్వ్ చేస్తుంటారని, ఈ జంట నుంచి నేటి తరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. శారీరక వైకల్యం వీరి మనోబలాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదని, ఇది ఇన్స్పిరేషనల్ వీడియో అని యూజర్స్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. వీరు గౌరవప్రదమైన జంటని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు.