భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. జవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్కేది గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెండ్లు సోను, సావిత్రి, లలితగా గుర్తించారు. వీరు తమ తల్లి సోదరుడితో కలిసి నివసిస్తున్నారు.
ఘటనా ప్రాంతంలో సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో వీరి మరణానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. చెట్టుకు వేలాడుతూ అక్కాచెల్లెండ్ల మృతదేహాలు కనిపించడంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.