న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఊహించని రీతిలో దూసుకెళ్తుతున్నాయి. రుతుపవనాలు దాదాపు 80 శాతం దేశమంతా వ్యాపించినట్లు భారతీయ వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేశ్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల చాలా వేగంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించిన్నట్లు ఐఎండీ అధికారి తెలిపారు. ఆదివారం రోజే ఢిల్లీ, ముంబై నగరాలకు రుతుపవనాలు చేరుకున్నాయి. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి మార్పు జరిగినట్లు డాక్టర్ కుమార్ వెల్లడించారు.
నిజానికి జూన్ 11న ముంబైకి, జూన్ 27వ తేదీన ఢిల్లీకి రుతుపవనాలు విస్తరిస్తుంటాయని, కానీ రెండు మెట్రో నగరాలకు ఒకే రోజున రుతుపవనాలు చేరుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది కొత్త విధానంలో రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. అస్సాంలో ప్రస్తుతం మేఘాలు వీడాయని, అక్కడ వర్షపాతం ఇప్పుడు తక్కువగా నమోదు కానున్నట్లు కుమార్ తెలిపారు. రుద్రప్రయాగ్తో పాటు ఉత్తరాఖండ్లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్లు ఆయన చెప్పారు.