Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఆచితూచి అభ్యర్థులను (candidates ) ఎంపిక చేస్తోంది. స్థానిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పలువురు సిట్టింగులను కూడా పక్కకు పెట్టేస్తోంది.
ఇక లోక్సభ ఎన్నికల (Lok Sabha Polls) కోసం బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 2వ తేదీన తొలి జాబితాను ప్రకటించిన కమలం పార్టీ.. మార్చి 13వ తేదీన రెండో జాబితాను విడుదల చేసింది. పది రోజుల గ్యాప్తో రెండు జాబితాలను ప్రకటించింది. ఇక తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించిన పార్టీ.. 33 మంది సిట్టింగులకు టికెట్లు నిరాకరించింది. రెండో జాబితాలోనూ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. సెకెండ్ లిస్ట్లో 72 మందికి అవకాశం కల్పించిన కమలం పార్టీ.. 30 స్థానాల్లో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వలేదు.
రెండు జాబితాల్లో కలిపి 267 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో 63 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు (sitting MPs) టిక్కెట్లు ఇవ్వలేదు. అంటే రెండు జాబితాల్లో ఇప్పటి వరకూ 21 శాతం మంది సిట్టింగ్లను పక్కకు పెట్టేసినట్లైంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, స్థానిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Also Read..
Amit Shah | సీఏఏను ఎన్నటికీ వెనక్కి తీసుకోబోం.. అమిత్ షా స్పష్టీకరణ
Harry Brook | మా కుటుంబంలో విషాదం.. అందుకనే ఐపీఎల్ ఆడొద్దనుకున్నా
Tik Tok | అమెరికాలో టిక్టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం