న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పార్లమెంట్లో మాట్లాడటానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్న శాసనకర్తలపై ప్రాసిక్యూషన్ నిర్వహించకుండా మినహాయింపును ఇస్తూ 1998 జేఎంఎం లంచం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శాసనకర్తల చర్యలు నేరపూరితం అయినప్పటికీ వర్తిస్తుందా అన్న విషయాన్ని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
1998లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టసభలో మాట్లాడటానికి, లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంఎల్ఏలు, ఎంపీలకు విచారణ నుంచి నుంచి మినహాయింపు ఇచ్చింది. 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసు తీర్పును పునః పరిశీలించేందుకు గత నెల 20న ధర్మాసనం అంగీకరించింది.