షిమ్లా: ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ప్రదేశ్ను (Himachalpradesh) ఇప్పట్లో వరణుడు వదిలేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) మరో పిడుగులాంటి వార్త అందించింది. రానున్న 24 గంట్లో అతి భారీ వర్షాలు (Very heavy rains) కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) జారీచేయగా, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీచేసింది. సోలన్, షిమ్లా, సిర్మౌర్, కుల్లు, మండీ, కిన్నౌర్, లాహౌల్ జిల్లా అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఉనా, హమీర్పూర్, కాంగ్రా, చంబా జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా మండి, కిన్నౌర్, లాహౌల్-స్పిటీలకు వరద ముప్పు పొంచిఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ సందీప్ కుమార్ శర్మ చెప్పారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల నీట మునిగిన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వారికోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
ఇదిలావుంటే బియాస్ నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. ఇరువైపుల ఉన్న దుకాణ సముదాయాలను, ఆవాసాలను తనలో కలుపుకుపోతూ బీభత్సం సృష్టిస్తున్నది. నది వెంట రోడ్లపై పార్కు చేసిన వాహనాలు కూడా కాగితపు పడవల్లా బియాస్ నదిలో కొట్టుకుపోతున్నాయి. కాగా, వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 18 మంది మరణించారు. మరో 300 మందికిపైగా పర్యాటకులు, స్థానికులు వరదల్లో చిక్కుకుపోయారని అధికారుల తెలిపారు.
Shimla | A red alert has been issued for very heavy rainfall in Solan, Shimla, Sirmaur, Kullu, Mandi, Kinnaur, and Lahaul for the next 24 hours. Additionally, an orange alert has been issued in Una, Hamirpur, Kangra, and Chamba. A flash flood warning has been issued for Mandi,… pic.twitter.com/dxWPhiYgYB
— ANI (@ANI) July 10, 2023