న్యూఢిల్లీ: జార్ఖండ్లోని అక్రమ మైనింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) 18 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. మన్రేగా నిధులను మైనింగ్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జార్ఖండ్లోని ఓ సీఏ ఇంటి నుంచి 17 కోట్ల నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్కు సీఏ సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాంచీ, చండీఘడ్, ముంబై, కోల్కతా, ముజాఫర్పుర్, సహస్రతో పాటు ఎన్సీఆర్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్లో సోదాలు జరిగాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఆ రాష్ట్ర మైనింగ్ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసులు ఈడీ సోదాలకు సహకరిస్తున్నారు. కొందరు వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు.