IIT DELHI| న్యూఢిల్లీ: అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ, అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ మద్రాస్ తర్వాత విదేశాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నరెండో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలటీ ఐఐటీ-ఢిల్లీనే. టాంజానియాలో క్యాంపస్ ఏర్పాటుచేసేందుకు ఐఐటీ మద్రాస్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది. అబుధాబిలో ఏర్పాటుచేస్తున్న ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో వచ్చే ఏడాది జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి బ్యాచ్లర్ డిగ్రీ కోర్సులు మొదలవుతాయి