న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. ఆస్పత్రులకు బాధితుల తాకిడి పెరిగిపోవడంతో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో నత్రజనిని ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లుగా మార్చుకునేందుకు వీలయ్యే సరికొత్త సాంకేతికతను బాంబే ఐఐటీ పరిశీలిస్తున్నది.
తమ సంస్థకు చెందిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే క్రయోజెనిక్ ఇంజినీరింగ్లో నిపుణుడని, ఆయన టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్తో కలిసి ఈ పైలెట్ ప్రాజెక్టును చేపట్టారని బాంబే ఐఐటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నత్రజని ఉత్పత్తి ప్లాంట్లలోని అణుసంబంధ జల్లెడలను కార్బన్ నుంచి జియోలైట్కు మార్చడం ద్వారా ఆ ప్లాంట్లు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లుగా మారుతున్నాయని తెలిపింది.
వాతావరణం నుంచి గాలిని ముడిపదార్థంగా తీసుకుని ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలిగే ఇలాంటి ప్లాంట్లు భారతదేశం అంతటా వివిధ పరిశ్రమల్లో ఉన్నాయని ఐఐటీ బాంబే పేర్కొన్నది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఆయా ప్లాంట్లు చక్కగా ఉపయోగపడుతాయని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా వైరస్కు ప్రధాని మోదీయే సూపర్ స్ప్రెడర్..!
ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి