న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు ప్రధాని నరేంద్రమోదీయే ప్రధాని కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఉపాధ్యక్షుడు నవజోత్ దహియా ఆరోపించారు. ప్రధాని మోదీని కరోనా వైరస్కు సూపర్ స్ప్రెడర్గా అభివర్ణించారు. దేశంలో ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ వేగంగా ప్రబలుతుంటే ప్రధాని మోదీ మాత్రం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచార సభలు నిర్వహించారని, కుంభమేళాకు అనుమతించారని, అదే ప్రస్తుత దుస్థితికి దారితీసిందని దహియా విమర్శించారు.
ఒకవైపు ఆరోగ్య యంత్రాంగం ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా భారీ ప్రచారసభలు నిర్వహించి, ప్రసంగాలు చేశారని, కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారని నవజోత్ దహియా వ్యాఖ్యానించారు. భారత్లో 2020, జనవరిలో తొలి కేసు నమోదైనప్పుడు కూడా ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
తొలి వేవ్లోనూ ప్రధానిది నిర్లక్ష్యమే..!
గత ఏడాది తొలి వేవ్ సందర్భంలోనూ ప్రధాని మోదీ వైరస్ కట్టడికి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాల్సింది పోయి, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలుకడం కోసం గుజరాత్లో లక్ష మందికిపైగా జనంతో భారీ సమావేశం ఏర్పాటు చేశారని దహియా విమర్శించారు. ఈ ఏడాది కాలంగా కూడా మోదీ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తి విఫలమవుతున్నదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మీడియా సైతం భారత్లో కరోనా విస్తృతికి ప్రధాని నరేంద్రమోదీ, అతని పాలనాయంత్రాంగ వైఫల్యమే కారణమని విమర్శిస్తున్నదని నవజోత్ దహియా తెలిపారు. ఆక్సిజన్ కొరతవల్ల ఇటీవల ఎంతో మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారని, ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కేంద్రం పెండింగ్లో పెట్టడంవల్లే ఈ ఘోరాలు జరిగాయన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి