న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. ఉపవాసం తర్వాత సాయంత్రం వేళలో ఇచ్చే ఈ విందు వల్ల కుటుంబం, కమ్యూనిటీ సంబంధాలు బలోపేతమవుతాయని, దాతృత్వం, సంఘీభావం, సాంఘిక మార్పిడిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరిస్తారని, సాంఘిక విలువలు పెంపొందుతాయని వివరించింది.